Friday, April 26, 2024

కూతురుపై తండ్రే ఆ పనిచేశాడు.. తల్లికి విషయం తెలియడంతో..

వికారాబాద్ జిల్లాలో దారుణం జ‌రిగింది… మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘ‌టన వెలుగులోకి వ‌చ్చింది. కూతురుపై తండ్రి కొంతకాలంగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. కాగా బాలిక‌ గర్భం దాల్చడంతో ఈ విష‌యం బ‌య‌ట‌ప‌డింది. బాలిక‌ను త‌ల్లి నిల‌దీయ‌గా కన్నతండ్రే అఘాయిత్యానికి పాల్పాడాడని కూతురు చెప్ప‌డంతో అంతా షాక్ తిన్నారు.

బతుకుదేరువుకోసం హైదరాబాద్ లోని పఠాన్ చెరు ప్రాంతంలో ఈ కుటుంబ ఉంటోంది. వీరికి ముగ్గురు కూతుళ్లు…. అయితే అత్యాచారానికి గురైన బాలిక పెద్ద కూతురు. కాగా త‌మ సొంత గ్రామం చేరుకొని బాలిక తల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసునమోదు చేసుకొని పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement