Monday, April 15, 2024

Breaking: కుటుంబం ఆత్మహత్యాయత్నం… తండ్రి మృతి, తల్లి ప‌రిస్థితి విష‌మం..

నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక కుటుంబం ఆత్మహత్యాయత్నం చెయ్యగా.. తండ్రి మృతి, భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఇద్దరి బాలుర ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాంకంపెట్ లో నివాసముంటున్న సాయిలు రోజు కూలీగా పనిచేస్తూ.. జీవనం కొనసాగిస్తున్న అతడికి అప్పులున్నాయి.

ఆ బాధలు తాళలేక అర్ధరాత్రి సమయంలో కుటుంబానికి చెందిన నలుగురు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వారిని హుటాహుటిన జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. సాయిలు మృతి చెందాడు. అతని భార్య రేఖ పరిస్థితి విషమం ఉంది. ఇద్దరు బాలురు అయిన చరణ్ (14), అరుణ్ (12)ల పరిస్థితి నిలకడగా ఉంది. బాలురు 7వ తరగతి ఒకరు, 6వ తరగతి ఒకరు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement