Tuesday, April 16, 2024

చాక్లెట్​ అనుకొని ఎలుకల మందు తిని చిన్నారి మృతి

ఓ చిన్నారి చాక్లెట్​ అనుకొని ఎలుకల మందును తిని మృతి చెందిన‌ ఘటన మహారాష్ట్ర నాగ్​పుర్​లోని జై గురుదేవ్ నగర్​లో చోటుచేసుకుంది. మూషికాలను నివారించేందుకు ఇంట్లో పెట్టిన ఎలుకల మందు తమ బిడ్డ ప్రాణం తీస్తుందని ఆ తల్లిదండ్రులు ఊహించలేకపోయారు. ఎలుకల బెడద ఎక్కువగా ఉండడం వల్ల వాటిని నివారించేందుకు మృతురాలు గుంజన్ నిలేశ్ (4) ఇంట్లో ఎలుకల మందు పెట్టారు. బొమ్మతో ఆడుకుంటూ.. చాక్లెట్ ఆకారంలో ఉన్న ఆ మందును చిన్నారి తినేసింది. వెంటనే ఆమె అసౌకర్యంగా ఉండడం వల్ల తల్లి ప్రశ్నించింది. ఆ బాలిక చాక్లెట్​ తిన్నానని చెప్పింది. వాంతులు చేసుకోవడం వల్ల.. ఆమె తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే గుంజన్ మృతిచెందింది. చిన్నారి మృతి చెంద‌డంతో ఆ కుటుంబసభ్యులు బోరున విల‌పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement