Friday, April 19, 2024

Breaking: బైకును తప్పించబోయి కాల్వలోకి దూసుకెళ్లిన బస్సు.. తప్పిన పెను ప్రమాదం

జనగామ, (ప్రభ న్యూస్): హైదరాబాద్ నుండి జనగామకు వస్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న బైక్​ని తప్పించబోయి పంట కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన సోమవారం జనగామ జిల్లా పెంబర్తి శివారు కాకతీయ తోరణం సమీపంలో ఇవ్వాల సాయంత్రం జ‌రిగింది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ డిపోకు చెందిన ఈ బస్సు హైదరాబాద్ బోరబండ నుండి జనగామకు వస్తుండగా ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం తప్పించే క్రమంలో అదుపుతప్పింది. దీంతో పక్కనే ఉన్న పంట కాల్వలోకి దూసుకెళ్లింది.

కాగా, డ్రైవర్​ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు. అయితే బస్సు పక్కకు దూసుకెళ్తుండగా ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. యాదగిరిగుట్ట నుండి సూర్యాపేట వెళ్తున్న మంత్రి జగదీష్ రెడ్డి ఈ ప్రమాద ఘటన చూసి కాన్వాయ్ ఆపారు. ప్రయాణికులకు మంచినీళ్లు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రమాదం నుండి చాకచక్యంగా తప్పించి ప్రయాణికులను కాపాడిన ఆర్టీసీ డ్రైవర్​ను మంత్రి ప్రశంసించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement