Tuesday, April 23, 2024

Test Cricket: అయ్యర్, జడేజా ఆన్ డ్యూటీ.. భార‌త్‌ 258/4

న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో ర‌వీంద్ర జ‌డేజా మ‌రో హాఫ్ సెంచ‌రీ చేశాడు. టెస్టుల్లో అత‌నికి ఇది 17వ హాఫ్ సెంచ‌రీ. తొలి టెస్టులో భాగంగా ఇవాళ జ‌డేజా 99 బంతుల్లో అర్ధ‌శ‌త‌కం కంప్లీట్ చేశాడు. అయిదో వికెట్‌కు అయ్య‌ర్‌తో క‌లిసి జడేజా భారీ భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు. ఇద్ద‌రి మ‌ధ్య ఫిఫ్త్ వికెట్ భాగ‌స్వామ్యం 100 ప‌రుగులు దాటింది. ఇవాళ (గురువారం) ఉద‌యం తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా మొద‌టి రోజు గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోర్‌ను సాధించింది.

తొలి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ఇండియా నాలుగు వికెట్లు కోల్పోయి 258 పరుగులు చేసింది. వెలుతురు స‌రిగా లేని కార‌ణంగా కేవ‌లం 84 ఓవ‌ర్లు మాత్ర‌మే వేశారు. ఇండియ‌న్ ఇన్నింగ్స్‌లో శుభ‌మ‌న్ గిల్‌, జ‌డేజా, అయ్య‌ర్ హాఫ్ సెంచ‌రీలు చేశారు. తొలి టెస్టు ఆడుతున్న అయ్య‌ర్ 75, జ‌డేజా 50 ర‌న్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు. న్యూజిలాండ్ బౌల‌ర్ల‌లో కైల్ జేమిస‌న్ 3 వికెట్లు తీయ‌గా.. సౌథీ ఖాతాలో ఒక వికెట్ చేరింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌,  ట్విట్టర్   పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement