Thursday, April 25, 2024

Srinagar : ఉపాధ్యాయురాలిని కాల్చి చంపిన ఉగ్రవాదులు

జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌ జిల్లా గోపాల్‌పొరా ప్రాంతంలో హైస్కూల్‌ ఉపాధ్యాయురాలిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడగా.. ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించారు. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు, పోలీసుల బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఉగ్రవాదుల కోసం సెర్చ్‌ ఆపరేషన్‌ను ప్రారంభించాయి. మృతురాలిని రజనీ భల్లాగా గుర్తించారు. రజనీ జమ్మూ డివిజన్‌లోని సాంబా జిల్లా నివాసి. కాల్పులకు తెగబడ్డ వారిని త్వరలోనే గుర్తించి, మట్టుబెడుతామని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement