Thursday, April 18, 2024

Breaking: ఘోర రోడ్డుప్ర‌మాదం .. ముగ్గురు దుర్మరణం..

ఘోర రోడ్డుప్ర‌మాదంలో ముగ్గురు దుర్మ‌ర‌ణం పాలైన తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని చేవూర్‌ సమీపంలో జాతీయ రహదారిపై ఆగిఉన్నలారీని ఓ కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో వృద్ధుడు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. దీంతో క్రేన్‌ సాయంతో మృతులను కారులో నుంచి వెలికితీశారు. మృతులను నందిపేటకు చెందినవారిగా గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement