Friday, March 29, 2024

Breaking : టెన్త్ విద్యార్థినిపై ఐదుగురు క్లాస్ మేట్స్ అత్యాచారం..

హైద‌రాబాద్ న‌గ‌రంలోని హయత్ నగర్ తట్టి అన్నారం వైఎస్ఆర్ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. పదవ తరగతి విద్యార్థినిపై తోటి క్లాస్ మేట్స్ ఐదుగురు అత్యాచారానికి పాల్ప‌డ్డారు. అత్యాచారం చేసే సమయంలో నిందితుల్లో ఒకరు వీడియో తీశారు. ఎవరికైనా చెబితే వీడియోని సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరించారు. పదిరోజుల తరువాత నిందితులు మరోసారి అత్యాచారం చేశారు. వీడియో తీసి తోటి విద్యార్థులకి నిందితులు పంపారు. బాధిత కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement