Friday, April 26, 2024

నిజామాబాద్ కు బండి సంజయ్.. ముందస్తు అరెస్టు చేసే అవకావశం!

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. బీజేపీ ఎంపీ అర్వింద్‌పై దాడికి నిరసనగా నేడు చలో నిజామాబాద్ కు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా నేడు బీజేపీ చీఫ్ బండి సంజయ్ నిజామాబాద్ పర్యటనకు వెళ్తున్నారు. ఆర్మూర్ లో బీజేపీ కార్యకర్తలను పరామర్శించనున్నారు. బండి సంజయ్ పర్యటన నేపథ్యంలో పోలీసులు అలెర్ట్ అయ్యారు. నిజామాబాద్ వెళ్లకుండా పలువురు బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ లు చేసేందుకు సిద్దమైయ్యారు. అయితే, తాము వెనక్కి తగ్గబోయేది లేదంటున్నారు బీజేపీ నేతలు స్పష్టం చేశారు.

కాగా, రెండు రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఆర్మూరు నియోజకవర్గంలో ఎంపీ అరవింద్ జనవరి 25న పర్యటించారు. ఈ నేపథ్యంలో ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన రైతులు, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎంపీ ధర్మపురి అరవింద్ పై దాడికి పాల్పడ్డారు. అరవింద్ గో బ్యాక్ అంటూ నినాదాల చేస్తూ ఆయన కారు అద్దాలు పగలగొట్టారు. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కావాలనే తనపై దాడి చేయించారని ఎంపీ అరవింద్ ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement