Tuesday, April 16, 2024

Telangana: అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య.. ఆదిలాబాద్ జిల్లాలో ఘ‌ట‌న‌

నేరడిగొండ (ప్ర‌భ‌న్యూస్‌): ఆదిలాబాద్ జిల్లాలో భూమి కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న ఓ రైతు ఆత్మ‌హ‌త్య చేసుకుని చ‌నిపోయాడు. వేసిన పంట దిగుబడి రాక పురుగుల మందు తాగాడు. విష‌యం తెలుసుకున్న కుటుంబ స‌భ్యుల అత‌డిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా ట్రీట్‌మెంట్ తీసుకుంటూ ఇవ్వాల చ‌నిపోయాడు. ఈ ఘటన నేర‌డిగొండ మండలంలో జ‌రిగింది.

కుమారి గ్రామనికి చెందిన అలకంటి శ్రీనివాస్ (32) కౌలుకు తీసుకున్న‌ భూమిలో పంట వేశాడు. అకాల వర్షాలతో ఆశించిన దిగుబడి రాక , చేసిన అప్పులు తీర్చే మార్గం లేక‌ ఆందోళనతో మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు శ్రీనివాస్ ను ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement