Saturday, April 20, 2024

Elections: పంజాబ్ మార్పుకోసం పది సూత్రాలు.. వరాల జల్లు కురిపిస్తున్న కేజ్రీవాల్

మరికొన్ని రోజుల్లో పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సీఎం పీఠం దక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్​ తోపాటు  ఇతర పార్టీలు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు నానా తంటాలు పడుతున్నాయి. దీనిలో భాగంగా లీడర్లు వరాల జల్లు కురిపిస్తున్నాయి. కాగా, ఆమ్​ ఆద్మీ పార్టీ(ఆప్​) అదే పంథాలో పయనిస్తోంది. 10 సూత్రాల ‘పంజాబ్​ మోడల్​’ పేరుతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని ప్రజల ముందుకొచ్చారు ఆప్​ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​.

‘‘ఆప్ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు 10 సూత్రాలతో ‘పంజాబ్ మోడల్’ను సిద్ధం చేశాం. సంపన్నమైన పంజాబ్‌గా తీర్చిదిద్దుతాం. ఫలితంగా ఉపాధి కోసం కెనడా వెళ్లిన యువత తిరిగి ఇక్కడకే వచ్చి ఉద్యోగం చేసుకునేలా ఉపాధి అవకాశాలు కల్పిస్తాం’’ అని- కేజ్రీవాల్ చెబుతున్నారు.

భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పిస్తాం

300 యూనిట్లు వరకు 24/7 ఉచితంగా విద్యుత్​ అందిస్తామని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నియంత్రిస్తామని, రాష్ట్రంలో శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వం నెలకొల్పుతామని చెబుతున్నారు కేజ్రీవాల్. మతవిద్వేషాల కేసుల్లో బాధితులకు న్యాయం.. నిందితులను కఠినంగా శిక్షించడం. అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం అంటున్నారు. 16,000 మొహల్లా క్లినిక్‌లను ఏర్పాటు చేసి.. ఉచితంగా వైద్యం అందిస్తాం. విద్య, ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరచడం.18 ఏళ్లు దాటిన మహిళలకు నెలనెలా రూ.1000 ఇస్తాం. రైతుల సమస్యలను పరిష్కరిస్తాం. అని చెబుతున్నారు.

మార్పు కోసం గెలిపించండి..

- Advertisement -

కొన్నేళ్లుగా కాంగ్రెస్‌,  బాదల్​ కుటుంబం మధ్య పొత్తు కొనసాగుతోందని.. వారు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు కేజ్రీవాల్. దీనికి ముగింపు పలకడానికి తమ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని చరణ్​జిత్​ సింగ్​ చన్నీ నేతృత్వంలోని పంజాబ్​ సర్కారుపై కేజ్రీవాల్​ విమర్శలు గుప్పించారు​. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని ఆరోపించారు. సీఎం అభ్యర్థి ప్రకటన ఎప్పుడంటే.. వచ్చే వారం ప్రకటించనున్నట్లు ఆమ్​ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్​ కేజ్రీవాల్​ వెల్లడించారు. సిక్కు వర్గానికి చెందిన వ్యక్తినే సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 14న రాష్ట్రంలోని 117 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరగున్నాయి. ఎన్నికలకు కౌంటింగ్ మార్చి 10న నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement