Saturday, April 20, 2024

Telangana: బదిలీ చేయడం లేదన్న మనస్తాపంతో ఆర్టీసీ డ్రైవర్​ ఆత్మహత్య.. గోదావరిఖనిలో ఘటన

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో శుక్రవారం అర్ధరాత్రి టీఎస్‌ఆర్‌టీసీ (తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ) డ్రైవర్‌ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడు దొరగర్ల రాజయ్య (50)గా పోలీసులు తెలిపారు. తనను వేరే ప్రాంతానికి బదిలీ చేయడంపై మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డట్ట తెలుస్తోంది. రాజయ్య తన కుటుంబంతో సహా హైదరాబాద్‌కు వెళ్లి ప్రగతినగర్ ప్రాంతంలో ఉంటున్నాడు. శనివారం బస్టాండ్ కాలనీలోని తన ఇంట్లో రాజయ్య మృతదేహం వేలాడుతూ కనిపించడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోదావరిఖని డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న రాజయ్య ఐదు నెలల క్రితం హైదరాబాద్‌లోని జేబీఎస్‌ డిపోకు బదిలీ అయ్యాడు. హైదరాబాద్‌లో పనిచేయాలన్న ఆసక్తి లేదని పలుమార్ల రాజయ్య తెలిపాడు.  నవంబర్ 23న గోదావరిఖని డిపో అధికారులను ఆశ్రయించి తనను తిరిగి బదిలీ చేయాలని అభ్యర్థించాడు. దీంతో కొన్ని నెలలపాటు JBSలో కొనసాగాలని అధికారులు అతనికి సూచించారు. అయితే..ఈ మూడు సంవత్సరాల కాలంలో మానసికంగా కృంగిపోయాడు. ఈ విషయాన్ని రాజయ్య భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement