Friday, March 29, 2024

KTR: తెలంగాణలో 29 మెడికల్​ కాలేజీలు, అందులో మోదీ ఇచ్చినవి ఎన్నో తెలుసా?: కేటీఆర్​ ట్వీట్​ వైరల్​

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు రాష్ట్రంలో 16 కొత్త మెడికల్ కాలేజీలను మంజూరు చేయడం ద్వారా వైద్య విద్యను విస్తృతం చేశారని, మరో 13 ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ఆదివారం తెలిపారు. టీఆర్​ఎస్​ పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​, మంత్రి కేటీఆర్​ ఓ ట్వీట్​లో దీనికి సంబంధించిన వివరాలు పోస్టు చేశారు. అయితే.. 2014లో రాష్ట్రం ఏర్పడక ముందు ఈ ప్రాంతంలో కేవలం ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే ఉండేవన్నారు.

“గౌరవనీయులైన తెలంగాణ సీఎం కేసీఆర్ గారు వైద్య విద్యలో చరిత్ర సృష్టించారు. 2014కు ముందు, 67 ఏళ్లలో కేవలం 5 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే తెలంగాణలో ఏర్పాటు ఉండేవి. గత 8 సంవత్సరాలలో 16 కొత్త మెడికల్ కాలేజీలు మంజూరు చేసుకున్నాం. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీగా (sic) మరో 13 సెటప్ చేయబోతున్నాం” అని ఆయన ట్వీట్ చేశారు.

సంగారెడ్డి, మహబూబాబాద్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, రామగుండం, జగిత్యాలలో మెడికల్‌ కాలేజీలు దాదాపు పూర్తయ్యాయని, కొత్తగూడెంలో కాలేజీని త్వరలో ప్రారంభిస్తామన్నారు మంత్రి కేటీఆర్​. “ఇప్పుడు మన ప్రధాని మోడీ జీ తెలంగాణకు ఎన్ని మెడికల్ కాలేజీలను మంజూరు చేశారో నేను మీకు చెప్తాను” అని మరో ట్వీట్​ చేస్తూ.. ​ అందులో “0” అని పేర్కొన్నారు. ఇప్పుడీ ట్వీట్లు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement