Thursday, April 25, 2024

Covid-19: తెలంగాణలో 30 మందికి కరోనా

తెలంగాణలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. నిన్న 15,633 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 30 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాదు జిల్లాలో 17 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 24 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 7,91,857 పాజిటివ్ కేసులు నమోదు కాగా… ఇందులో 7,87,508 మంది ఆరోగ్యవంతులయ్యారు. ప్రస్తుతం 238 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement