Friday, April 19, 2024

తెలంగాణలో కొత్తగా 643 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల  గడచిన 24 గంటల్లో 1,20,530 కరోనా పరీక్షలు నిర్వహించగా, 643 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా నుంచి 767 మంది కోలుకొని డిశ్చార్జి కాగా, నలుగురు మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 3,778కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,40,012 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 6,26,505 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9,729 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, జీహెచ్ఎంసీ పరిధిలో 77, కరీంనగర్ జిల్లాలో 68, ఖమ్మం జిల్లాలో 57, వరంగల్ అర్బన్ జిల్లాలో 54 కొత్త కేసులు నమోదయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement