Thursday, April 25, 2024

తెలంగాణలో అదుపులోకి వచ్చిన కరోనా.. కొత్తగా ఎన్ని కేసులంటే..

తెలంగాణలో కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చింది. గత కొద్ది రోజులుగా 500 లోపు కేసులు మాత్రమే నమోదు అవుతున్నాయి. తాజాగా గడచిన 24 గంటల్లో 74,634 కరోనా పరీక్షలు నిర్వహించగా, 354 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. 427 మంది కరోనా నుంచి కోలుకోగా.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 3,861కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,55,343 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా… 6,45,174 మంది ఆరోగ్యవంతులయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,308 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, గడిచిన 24 గంటల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 57, కరీంనగర్ జిల్లాలో 32, నల్గొండ జిల్లాలో 25 కేసులు నమోదు అయ్యాయి. నారాయణపేట, నిర్మల్ జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement