Thursday, April 25, 2024

తెలంగాణలో కరోనా ఉగ్రరూపం.. ఒక్కరోజే 4వేలు దాటిన కేసులు

తెలంగాణలో క‌రోనా కేసులు రోజురోజుకు అధిక‌మ‌వుతున్నాయి. శుక్ర‌వారం రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు కొత్త‌గా 4,446 క‌రోనా కేసులు న‌మోద‌వ‌గా మ‌రో 12 మంది బాధితులు మ‌ర‌ణించారు. 1,414 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య‌ 3.46 ల‌క్ష‌ల‌కు చేరింది. ఇందులో 1,809 మంది బాధితులు వైర‌స్‌వ‌ల్ల మ‌ర‌ణించ‌గా మ‌రో 3.11 లక్ష‌ల మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం కేసుల్లో 33,514 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇందులో 22,118 మంది బాధితులు హోం ఐసోలేష‌న్‌లో ఉన్నారు. కొత్త‌గా న‌మోదైన పాజిటివ్ కేసుల్లో జీహెచ్ఎంసీ ప‌రిధిలో 598, రంగారెడ్డి జిల్లాలో 326, నిజామాబాద్‌లో 314 చొప్పున ఉన్నాయి. రాష్ట్రంలో శుక్రవారం నాడు 1,26,235 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement