Thursday, March 28, 2024

జీరో కేసుల దిశగా తెలంగాణ.. ఆ జిల్లాలో ఒక్కరికే కరోనా!

తెలంగాణలో కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చింది. గడిచిన 24 గంటల్లో కొత్త‌గా 648 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. మొత్తం 1,14,928 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా వీరిలో 648 మందికి పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. అదే సమయంలో వైరస్ కారణంగా ముగ్గురు చ‌నిపోయారు. మరో 696 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య 6,39,369కు చేరుకుంది. రాష్ట్రంలో కొవిడ్‌తో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 3,774 మంది చ‌నిపోయారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 82 కేసులు నమోదు కాగా,..అత్యల్పంగా కామారెడ్డిలో ఒక్క కేసు మాత్రం నమోదైంది.  

Advertisement

తాజా వార్తలు

Advertisement