Friday, March 29, 2024

తెలంగాణలో కొత్తగా 746 కేసులు నమోదు..

తెలంగాణలో కొత్తగా 746 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 1,20,165 నమూనాలను పరీక్షించగా కొత్త కేసులు వెలుగు చూసినట్లు పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,37,373కు పెరిగింది. కరోనా మహమ్మారి కారణంగా తాజాగా ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 3,764కి చేరింది. తాజాగా 729 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9,836 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మరణాల రేటు 0.59 శాతం కాగా.. రికవరీ రేటు 97.86 శాతంగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 71 మంది వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షించారు.

ఇది కూడా చదవండి : IPS పదవీకి RS ప్రవీణ్‌కుమార్‌ రాజీనామా..

Advertisement

తాజా వార్తలు

Advertisement