తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,384 కరోనా కేసులు, 157 మరణాలు నమోదైనట్లు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 5,83,228కి చేరింది. తాజా కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 307 కరోనా కేసులు వచ్చాయి. ఇక రాష్ట్రంలో కరోనా నుంచి మరో 2,242 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 33,379 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. మరోవైపు గడిచిన 24 గంటల్లో 1,08,696 కరోనా పరీక్షలు నిర్వహించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement