Friday, April 19, 2024

తెలంగాణలో కొత్తగా 647 కరోనా కేసులు.. రెండు మరణాలు!

తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో 1,20,213 పరీక్షలు చేయగా.. 647 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అదే సమయంలో 749 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 81 కొత్త కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 76, ఖమ్మం జిల్లాలో 58 కేసులు గుర్తించారు. అత్యల్పంగా నారాయణపేట, నిర్మల్ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,40,659 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 6,27,254 మంది ఆరోగ్యవంతులయ్యారు. ప్రస్తుతం 9,625 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనాతో 3,780 మంది మృతి చెందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement