Saturday, April 20, 2024

నేడు ప్రధాని మోడీతో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ భేటీ..

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. తెలంగాణలో అభివృద్ధి పనులతో పాటు రాజకీయ అంశాలపై ఇరువురు చర్చించే అవకాశముంది. విజయవాడ – హైదరాబాద్ ఆరులైన్ల జాతీయ రహదారిపై చర్చించనున్నారు. మూసీ ప్రక్షాళన, ఘట్కేసర్ నుంచి జనగామ వరకు ఎంఎంటీఎస్ రైలు పొడిగింపుపై ప్రధాని మోడీతో వెంకట్ రెడ్డి చర్చించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఢిల్లీ తెలంగాణభవన్ లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement