ఈరోజు మధ్యాహ్నం 2గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. రాష్ట్రంలో ఎన్నికలు రావడానికి ఏడాది మాత్రమే సమయం ఉండటంతో నేటి కేబినెట్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా కేంద్ర వైఖరిని ఎండగట్టేలా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అటు రాష్ట్ర గవర్నర్ తమిళిసై వ్యవహార శైలిపై ప్రత్యేకంగా చర్చించే అవకాశముంది. రైతు బంధు, దళితబంధు అమలుపై కేబినెట్ సమీక్ష నిర్వహించనుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement