Wednesday, April 24, 2024

నేడు తెలంగాణ కేబినేట్ – అత్యంత‌కీల‌క నిర్ణ‌యాలపై చ‌ర్చ‌లు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం గురువారం మధ్యాహ్నం 2 గంటలకు తెలం గాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్యక్షతన ప్రగతిభవన్‌ వేదికగా ఈ సమావేశం జరుగ నుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలపై చర్చించనున్నా రు. తాజాగా ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిన నేపథ్యం లో తదనంతరం అనుసరించే వ్యూహా లపై ప్రత్యేకంగా చర్చించ నున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం, కక్షపూ రిత చర్యలు, నిధుల విడుదలలో తీవ్ర జాప్యం తదితర అంశాలు అనధికారిక అజెండాలో ఉన్నా యి. ఢిల్లిd మద్యం ముడుపుల కేసు వ్యవహారం మరింత ముదిరితే, ఆ ప్రభావం వచ్చే ఎన్నికలపై ఏ మేరకు ఉంటుందన్న అంశంపై మరింత లోతుగా చర్చించనున్నారు. ఈ సారి త్రిముఖ పోటీ బలంగా ఉండడంతో త్వరలో జరిగే ఎన్నికలను అత్యంత ప్రతిష్టా త్మకంగా తీసుకోవాల్సిన అవసరం, ఆవశ్యకతను గురించి సీఎం కేసీఆర్‌ మంత్రులకు మార్గనిర్ధేశం చేయనున్నారు. అలాగే ప్రభు త్వం పంపిన బిల్లులు ఆమోదించకుండా గవర్నర్‌ చేస్తున్న రాజ కీయ వ్యవహారంపై కూడా కేబి నెట్‌లో చర్చ జరుగనుంది. అలాగే మరోముఖ్యమైన అంశం గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేయడం ఎలాగన్న అంశంపై మంత్రివర్గ సహచరుల తో చర్చించి సీఎం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాజ్‌భవన్‌లో అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

ఎన్నికల సమయంలోగా అర్హుల గుర్తింపు
ఇండ్లు, ఇళ్ల స్థలాలకు సంబంధించిన అంశాలు, అర్హులకు ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. సొంత జాగా ఉన్నవారు ఇల్లు నిర్మించుకునేందుకు మూడు లక్షల రూపాయల ఆర్థిక సాయం ఇచ్చే పథకాన్ని కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన విధి విధానాలపై కేబినెట్‌లో చర్చించి ఖరారు చేయనున్నారు. ఎన్నికలకు సమయం సమీపించే లోగా అర్హుల గుర్తింపు ప్రక్రియ పూర్తికావాల్సి ఉన్నందున, ఈ క్రమంలో అధికార యంత్రాంగానికి ఇవ్వాల్సి మార్గదర్శకాలపై చర్చించనున్నారు. నియోజకవర్గాల వారీగా జాబితాలు సిద్ధం చేసే క్రమంలో అనుసరించే వ్యూహంపై మంత్రిమండలి సమావేశంలో చర్చ జరుగనుంది.

కేటీఆర్‌ నేతృత్వంలోని సబ్‌కమిటీ నివేదికపై చర్చ
ఇళ్ల స్థలాలపై ఏర్పా-టైన మంత్రివర్గ ఉప సంఘం… ఇళ్ల స్థలాలు, క్రమబద్దీకరణ, పట్టాల పంపిణీ దిశగా కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించి కేటీఆర్‌ నేతృత్వంలోని సబ్‌కమిటీ ఇప్పటివరకు పూర్తిచేసిన కసరత్తు నివేదికను మంత్రిమండలి ముందుంచనుంది. అవకాశం ఉన్నచోట పట్టాల పంపిణీ కోసం అనువైన స్థలాలు, వాటి వివరాలను గుర్తించారు. దీంతో పట్టాల పంపిణీకి మంత్రివర్గంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. 58, 59 ఉత్తర్వుల కింద క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. గ్రామకంఠం సహా ఇతరత్రా ఇండ్ల స్థలాల అంశాలను పరిష్కరించి పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

కోటి కుటుంబాలకు లబ్ధి చేకూరేలా..
మొత్తం కోటి కుటు-ంబాలకు లబ్ధి చేకూరుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. పోడు పట్టాల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరించే వైఖరి, రాష్ట్ర ప్రభుత్వంగా అమలు చేయాల్సిన కార్యాచరణపై కేబినెట్‌లో చర్చించనున్నారు. ఉప్పుడు బియ్యాన్ని తీసుకోబోమని కేంద్రం చెబుతున్న తరుణంలో కొనుగోళ్లకు సంబంధించి ఏం చేయాలన్న విషయమై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -

దళిత బంధు విస్తరణపై కీలక నిర్ణయం
దళితబంధు పథకం విస్తరణ, అమలుపైనా కేబినెట్‌లో చర్చించనున్నారు. రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు మంత్రివర్గ ఉపసంఘం గత కొన్నాళ్లుగా కసరత్తు చేస్తోంది.ఈ నేపథ్యంలో క్రీడా విధాన ముసాయిదా కేబినెట్‌ ముందుకు వచ్చే అవకాశం ఉంది. భూముల అమ్మకం, ఇతరత్రా మార్గాల ద్వారా ఖజానాకు ఆదాయాన్ని పెంచుకోవడం, నిధుల సమీకరణపై కూడా చర్చించే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement