Friday, March 29, 2024

Bandi Sanjay: మోదీ కోసం మృత్యుంజ‌య హోమం

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ కోసం రేపు తెలంగాణవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో మృత్యుంజయ హోమాలు నిర్వ‌హించ‌నున్నారు. ఇటీవ‌ల పంజాబ్‌లో ప్ర‌ధాని మోదీ కాన్వాయ్‌ని అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో భ‌ద్ర‌తా వైఫ‌ల్యంపై దేశవ్యాప్తంగా చ‌ర్చ మొద‌లైంది. దీంతో మోదీ కోసం మృత్యుంజ‌య హోమాలు నిర్వహించాల‌ని బీజేపీ నిర్ణ‌యించింది. జిల్లా, మండల స్థాయి నేతలకు ఈ మేర‌కు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌ పిలుపునిచ్చారు.

సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ హోమాలు నిర్వహించనున్నారు. ఇందులో బాగంగా హైదరాబాద్‌ అల్కాపురిలోని శృంగేరి మఠం ఆలయంలో మృత్యుంజయ హోమానికి బండి సంజయ్ హాజ‌రు కానున్నారు. ప్ర‌ధానికి ఆయురారోగ్యాల‌ను ప్ర‌సాదించాల‌ని కోరుతూ ఈ హోం చేయ‌నున్న‌ట్లు బీజేపీ నేత‌లు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement