Wednesday, April 24, 2024

తొలి వన్డేలో టీమిండియా ఘనవిజయం..

శ్రీలంక‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘనవిజయం సాధించింది. బౌలింగ్ బ్యాటింగ్ తో అదరగొట్టిన భారత ఆటగాళ్లు ఏడు వికెట్ల తేడాతో లంకను చిత్తు చేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 9 వికెట్ల న‌ష్టానికి 262 ప‌రుగులు చేసింది. 263 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన టీమిండియా బ్యాట్స్‌మెన్‌ దూకుడుగా ఆడారు. ఇంకా 80 బంతులు మిగిలి ఉండ‌గానే మూడు వికెట్లు కోల్పోయి ల‌క్ష్యాన్ని చేధించారు. ఈ విజ‌యంతో టీమిండియా మూడు వ‌న్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో శిఖ‌ర్ ధావ‌న్ ( 86 ప‌రుగులు), ఇషాన్ కిష‌న్ (59 ప‌రుగులు) హాఫ్ సెంచ‌రీల‌తో మెరిశారు. పృథ్వీషా ( 43 ప‌రుగులు), మ‌నీష్ పాండే 26 ప‌రుగులు, సూర్య‌కుమార్ యాద‌వ్ 31 ప‌రుగులు చేశారు. ఇరుజట్ల మధ్య రెండో వన్డే జులై 20న ఇదే స్టేడియంలో జరగనుంది.

ఇది కూడా చదవండి : పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ గా నవజోత్ సింగ్‌ సిద్ధు నియామకం..

Advertisement

తాజా వార్తలు

Advertisement