Thursday, April 25, 2024

రెండో వన్డేలో టీమిండియా విజయం..2-0 తో సిరీస్ కైవసం

శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ ను భారత్ 2-0 తో విజయం సాధించింది. రెండో వన్డేలో జయభేరి మోగించిన భారత కుర్రాళ్ల జట్టు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. శ్రీలంక నిర్దేశించిన 276 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించి మ్యాచ్ తో పాటు సిరీస్ ను కైవసం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన శ్రీలంక గత వన్డే కంటే ఎక్కువ పరుగులే చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. ఓపెనర్ అవిష్క ఫెర్నాండో (50), చరిత్ అసలంక (65) అర్ధ సెంచరీలతో రాణించారు. భానుక 36, ధనంజయ డి సిల్వా 32, చివర్లో కరుణ రత్నె 44 పరుగులతో రాణించడంతో శ్రీలంక 9 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. భారత బౌలర్లలో చాహల్, భువనేశ్వర్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా, దీపక్ చాహర్ 2 వికెట్లు తీసుకున్నాడు.

ఛేజింగ్ లో భారత జట్టు 116 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. తొలి వన్డే హీరోలు పృథ్వీషా (13) ఇషాన్ కిషన్ (1) ఈసారి విఫలమయ్యారు. కెప్టెన్ శిఖర్ ధవన్ 29 పరుగులు చేసి అవుటయ్యాడు. మనీష్ పాండే (37), సూర్యకుమార్ యాదవ్ (53), కృనాల్ పాండ్యా (35) కీలక ఇన్నింగ్స్ ఆడారు. చాహర్ చివర్లో అద్భుత పోరాట పటిమతో చేజారిపోతుందనుకున్న మ్యాచ్‌ను గెలిపించి జేజేలు అందుకున్నాడు. 82 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో అజేయంగా 69 పరుగులు చేసి సిరీస్ విజయాన్ని అందించాడు. మ్యాచ్ ను గెలిపించి దీపక్ చాహర్ కే మ్యాన్ ఆప్ ది మ్యాచ్ లభించింది.

ఇది కూడా చదవండి: దేశంలో తొలి బర్డ్ ఫ్లూ మరణం..


Advertisement

తాజా వార్తలు

Advertisement