Thursday, April 25, 2024

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన

సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌కు టీమిండియా 18 మంది సభ్యులతో జట్టును ప్రకటించింది. వన్డే జట్టులో తొలిసారిగా సూర్యకుమార్‌ యాదవ్, కృనాల్ పాండ్యా, ప్రసిద్ధ్ కృష్ణలకు చోటు లభించింది. మూడు వన్డేలు పూణెలోనే జరుగుతాయి. ఈనెల 23, 26, 28 తేదీల్లో వన్డేలు జరగనున్నాయి.

☞ జట్టు వివరాలు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ (వైస్ కెప్టెన్), ధావన్, గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, రిషబ్ పంత్, చాహల్, కుల్దీప్, వాషింగ్టన్ సుందర్, నటరాజన్, భువనేశ్వర్ కుమార్, సిరాజ్, శార్దూల్ ఠాకూర్.

Advertisement

తాజా వార్తలు

Advertisement