Thursday, April 25, 2024

అమరావతిని, పోలవరాన్ని జగన్ నాశనం చేశారు: చంద్రబాబు

ఏపీలో జగన్ పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ పాలనలో ఏపీ 20 ఏళ్లు వెనక్కెళ్లిందని చంద్రబాబు దుయ్యబట్టారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదు, ఉపాధి, పెట్టుబడులు లేవన్నారు. సీఎం జగన్‌రెడ్డి పాలనలో వ్యవసాయరంగం సంక్షోభంలో పడిందని తెలిపారు. ప్రభుత్వ సాయం అందక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, టీడీపీ హయాంలో వ్యవసాయాన్ని అన్ని విధాల ప్రోత్సహించామని తెలిపారు.

తమ హయాంలో అమరావతి, పోలవరం రెండు కళ్లుగా రాష్ట్రాన్ని అభివృద్ది చేశామని చంద్రబాబు అన్నారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే 2020 జూన్ నాటికి పోలవరం పూర్తయ్యేదని చెప్పారు. జగన్ వచ్చి అమరావతిని, పోలవరాన్ని నాశనం చేశారని దుయ్యబట్టారు. అఫ్ఘానిస్తాన్ నుంచి ఏపీకి డ్రగ్స్‌ దిగుమతి జరుగుతోందని, సీఎం ఇంటి సమీపంలో ఓ కంపెనీ పేరుతో రూ.21 వేల కోట్ల హెరాయిన్ పట్టుబడిందన్నారు. డగ్స్ వ్యాపారంతో ఉగ్రవాదుల్ని ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రం బాగుపడాలంటే మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాలని చంద్రబాబు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement