Thursday, April 25, 2024

మ‌హా ప్ర‌స్థానంలో ముగిసిన తార‌క‌ర‌త్న అంత్య‌క్రియలు

న‌టుడు తార‌క‌ర‌త్న అంత్య‌క్రియ‌లు జూబ్లీహిల్స్ లోని మ‌హా ప్ర‌స్థానంలో ముగిశాయి. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానం వరకు అభిమానుల నీరాజనాల మధ్య సినీ నటుడు తారకరత్న అంతిమయాత్ర కొనసాగింది. అంత్యక్రియ‌ల ద‌గ్గ‌ర నంద‌మూరి కుటుంబ స‌భ్యులు క‌న్నీరు మున్నీర‌య్యారు.అంత్య‌క్రియ‌ల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడుతో పాటు విజ‌య‌సాయిరెడ్డి, నారా లోకేష్, బాల‌కృష్ణ‌, క‌ళ్యాణ్ రామ్, జూ.ఎన్టీఆర్, పలువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు పాల్గొన్నారు. తండ్రి మోహ‌న‌కృష్ణ చేతుల మీదుగా తార‌క‌ర‌త్న అంతిమ సంస్కారాలు నిర్వ‌హించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement