Saturday, April 20, 2024

తమిళనాడులో కొవిడ్‌ ఆంక్షల పొడగింపు

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి అడ్డు అదపు లేకుండా కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరిగిపోతున్న సమయంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20న అమలులోకి తీసుకువచ్చిన నైట్‌ కర్ఫ్యూ, ఇతర ఆంక్షలను పొడిగించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు లాక్‌‌డౌన్ అమలులో ఉంటాయని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. షాపింగ్ మాల్స్, థియేటర్లు, జిమ్ సెంటర్లు, పూర్తిగా మూసివేయాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న కర్ఫ్యూ ఎలాంటి సడలింపులు లేకుండా కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది. కేంద్ర హోంమంత్రిత్వశాఖ అనుమతించిన విమానాలు మినహా మిగతా ప్రయాణాలపై ప్రభుత్వం నిషేధం విధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement