Thursday, April 25, 2024

తాలిబ‌న్ల ఆరాచ‌కం- నిర‌స‌న తెలిపిన మ‌హిళ‌ల‌ని వెంబ‌డించి దాడులు

గ‌తేడాది ఆగ‌స్టు 15న తాలిబ‌న్లు కాబుల్ ను స్వాధీనం చేసుకున్నారు. రెండురోజుల్లో తాలిబ‌న్ల పాల‌న ఏడాదికావొస్తోంది. తాలిబ‌న్లు ఆఫ్గానిస్తాన్ ని చేజిక్కించుకున్న‌నాటి నుంచి మహిళల హక్కులను కాలరాస్తూ.. అంతకుముందు రెండు దశాబ్దాల్లో వారు సాధించిన ప్రగతిని అణగదొక్కుతోన్నారని అంతర్జాతీయ సంస్థలు ఆరోపిస్తున్నాయి.కాగా తాలిబన్లు మరోసారి మహిళలపై విరుచుకుపడ్డారు. హక్కుల సాధనకు రాజధాని కాబుల్‌లో వారు చేపట్టిన ఓ నిరసన ర్యాలీని హింసాత్మకంగా అణచివేశారు. మహిళా నిరసనకారులను చెదరగొట్టేందుకు గాల్లో కాల్పులు జరపడంతోపాటు వెంబడించి మరీ వారిపై దాడులకూ పాల్పడినట్లు మీడియా కథనాలు తెలిపాయి.

శనివారం దాదాపు 40 మంది మహిళలు ఉద్యోగ హక్కుతోపాటు రాజకీయ భాగస్వామ్యాన్ని డిమాండ్ చేస్తూ కాబుల్‌లోని విద్యాశాఖ భవనం ముందు ప్రదర్శన నిర్వహించారు. ‘ఆగస్టు 15 బ్లాక్ డే’ అని రాసి ఉన్న బ్యానర్‌ను పట్టుకుని.. ఆహారం, పని, స్వేచ్ఛ కావాలంటూ నినాదాలు చేశారు. అజ్ఞానంతో విసిగిపోయాం.. న్యాయం కావాలంటూ ర్యాలీ చేపట్టారు. దీంతో తాలిబన్లు తుపాకులతో గాల్లో కాల్పులు జరుపుతూ వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలోనే సమీపంలోని దుకాణాల్లో తలదాచుకున్న కొంతమంది మహిళా నిరసనకారులను వెంబడించి.. దాడులు చేశారు. అక్కడున్న కొంతమంది జర్నలిస్టులపైనా దాడికి దిగారు.మ‌రి తాలిబ‌న్ల ఆగ‌డాల‌కు అంతం లేదా అని అక్క‌డి ప్ర‌జ‌లు బిక్కు బిక్కుమంటూ కాలాన్ని వెల్ల‌బోస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement