Wednesday, April 24, 2024

దమ్ముంటే రండి.. ఒకేసారి ఎన్నికలకు వెళ్దాం: అమిత్ షాకి మంత్రి తలసాని సవాల్‌

కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి దేశ వ్యాప్త ఎన్నికలకు బీజేపీ సిద్ధమా ? అని ప్రశ్నించారు. దమ్ముంటే రండి.. ఒకేసారి ఎన్నికలకు వెళ్దామని సవాల్ విసిరారు. మీరు గెలుస్తారో.. మేం గెలుస్తామో ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు. కేంద్రమంత్రి హోదాలో అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అధికారంలో ఉన్నాం కదా అని ఏదైనా మాట్లాడుతామంటే కుదరదని మంత్రి తలసాని హితవు పలికారు. గుజరాత్‌లో డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. కళ్లుండి చూడలేని కబోదులు బీజేపీ నాయకులు అని విమర్శించారు. ప్రజలంతా టీఆర్‌ఎస్‌ వైపే ఉన్నారని మంత్రి తలసాని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement