Tuesday, March 26, 2024

మా నాన్నని జాగ్రత్తగా చూసుకోండి.. లాలూ ప్రసాద్ కుమారై ఎమోషనల్ పోస్ట్

రాష్ట్రీయ జనతాదళ్..అధినేత లాలూప్రసాద్ యాదవ్ కుమారై ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి.. ఈ ముఖ్యమైన విషయం మన అధినేత లాలూజీ ఆరోగ్యం గురించి.. నాన్న ఫిబ్రవరి 11న సింగపూర్ నుంచి ఇండియా వెళ్తున్నారు. కూతురిగా నా డ్యూటీ చేస్తున్నాను.. నాన్నకు ఆరోగ్యం చేకూర్చిన తర్వాత ఆయన్ని మీ అందరి మధ్యకు తిరిగి పంపిస్తున్నాను. ఇప్పుడు మీరంతా మా నాన్నగారిని జాగ్రత్తగా చూసుకోవాలి అని రోహిణి ఆచార్య ట్వీట్ చేశారు.గతేడాది డిసెంబర్‌లో సింగపూర్‌లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న లాలూ ప్రసాద్ యాదవ్ శనివారం భారత్‌కు తిరిగి రానున్నారు. ఈ నేపథ్యంలో తన తండ్రికి కిడ్నీ దానం చేసిన లాలూ కుమార్తె రోహిణి ఆచార్య ట్విట్టర్‌లో భావోద్వేగ పోస్ట్‌ షేర్ చేశారు. గత ఏడాది డిసెంబర్‌లో సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో లాలూ యాదవ్‌కు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement