Wednesday, April 24, 2024

టీ 20 ప్రపంచకప్‌.. ఫైనల్ కు చేరిన ఇంగ్లండ్ జట్టు…

టీ 20 ప్రపంచకప్‌లో రెండో సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టు ఘన విజయం సాధించింది. దీంతో ఆ జట్టు ఫైనల్ కు చేరుకుంది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఇండియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. 169 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 16 ఓవర్లలోనే విజయాన్ని చేజిక్కించుకున్నారు. భారత్ జట్టు ఓటమి పాలవడంతో ఇంటిబాట పట్టింది. ఇంగ్లండ్ ఓపెనర్లు జాస్ బట్లర్ 80 పరుగులు, అలెక్స్ హేల్స్ 86 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. దీంతో ఇంగ్లండ్ జట్టు ఆదివారం పాక్ తో ఫైనల్ లో తలపడనుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement