Tuesday, March 26, 2024

T20: పాకిస్తాన్‌‌ని చిత్తు చేసి.. ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా

టీ20 వరల్డ్ కప్ సెకండ్ సెమీఫైనల్లో పాకిస్తాన్ పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో ఆసీస్ గెలిచింది. పాకిస్తాన్ నిర్దేశించిన 177 పరుగుల టార్గెట్ ను ఆస్ట్రేలియా 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆసీస్ బ్యాటర్లలో ఓపెనర్ డేవిడ్ వార్నర్ 49 పరుగులతో రాణించాడు. చివర్లో మార్కస్ స్టోయినిస్(31 బంతుల్లో 40 పరుగులు), వేడ్(17 బంతుల్లో 41 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. వేడ్ 4 సిక్సులు బాదాడు.

దీంతో మరో ఓవర్ మిగిలి ఉండగానే ఆసీస్ గెలిచింది. పాకిస్తాన్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 4 వికెట్లు తీశాడు. అఫ్రిదీ 1 వికెట్ తీశాడు. ఈ విజయంతో ఆస్ట్రేలియా టీ20 వరల్డ్ కప్ లో ఫైనల్ చేరింది. ఫైనల్ లో న్యూజిలాండ్ తో తలపడనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement