Saturday, April 20, 2024

T N Blast : కుప్ప‌కూలిన మూడు ఇళ్లు…ఒక‌రు మృతి

త‌మిళ‌నాడు రాష్ట్రంలో భారీ పేలుడు ఘ‌ట‌న చోటుచేసుకుంది. సేలం జిల్లాలో గ్యాస్ సిలిండర్ పేలింది. గ్యాస్ సిలిండ‌ర్ పేల‌డంతో మూడు ఇళ్లు కుప్ప‌కూలి పోయాయి. ఈ ప్రమాదంలో ఒక‌రు మృతిచెంద‌గా, న‌లుగురికి తీవ్ర‌గాయాలయ్యాయి. గాయాల‌పాలైన వారిని హుటాహుటిన స‌మీపంలోని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ప్ర‌మాదంలో శిథిలా కింద మ‌రో 16 మంది చిక్కుకున్న‌ట్లు స‌మాచారం.

ఇదిలా ఉండ‌గా… హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ ప్రాంతంలో ఇవాళ‌ తెల్లవారుజామున గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో 11 మంది గాయపడగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఒక్కసారిగా భారీ శబ్ధాలతో గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో చుట్టుపక్కల వారు భయాందోళనకు గురయ్యారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement