Tuesday, March 26, 2024

సయ్యద్‌ మోడీ ఇంటర్నేషనల్‌ టోర్నీ.. రెండో రౌండ్‌లో సింధు

తెలుగు తేజం పీవీ సింధు.. సయ్యద్‌ మోడీ ఇంటర్నేషనల్‌ సూపర్‌ 300 టోర్నీలో దూసుకెళ్తున్నది. తొలి రౌండ్‌లో ఇండియన్‌ షట్లర్‌ తాన్యా హేమంత్‌పై పూర్తి ఆధిపత్యం కొనసాగించింది. 26 ఏళ్ల సింధు.. గతవారం జరిగిన ఇండియా ఓపెన్‌ సూపర్‌ టోర్నీ.. సెమీస్‌లో ఓడిపోయింది.

తాజా టోర్నీలో తాన్యాపై 21-9, 21-9 పాయింట్ల తేడాతో గెలుపొందింది. బాబు బనారసీ దాస్‌ ఇండోర్‌ స్టేడియంలో టోర్నీ కొనసాగుతున్నది. ఇరా శర్మను ఓడించిన అమెరికన్‌ క్రీడాకారిణి లారెన్‌ లామ్‌తో సింధు తలపడనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement