Friday, March 29, 2024

సుస్మిత నిర్మాత‌గా సేనాప‌తి – ట్రైల‌ర్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమారై సుస్మిత నిర్మాత‌గా మారిన సంగ‌తి తెలిసిందే. ఈ మేర‌కు ఓటీటీ వెంచ‌ర్ గా సేనాప‌తి చిత్రాన్ని నిర్మించింది.ఈ చిత్రంలో రాజేంద్ర‌ప్ర‌సాద్ ప్ర‌ధాన పాత్ర‌ని పోషించారు. ప‌వ‌న్ సాధినేని డైరెక్ట‌ర్. ఈ చిత్రం ఆహా ఓటీటీలో ఈ నెల 31నుండి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. “జీవితంలో మంచి – చెడు రెండూ చూడాలి, ఆ రెండింటి మధ్యే ఎదగాలి” అనే డైలాగ్ తో ఈ ట్రైలర్ మొదలైంది. పోలీస్ లకు .. రౌడీలకు మధ్య వార్ జరుగుతూ ఉంటుంది. ఒక సాధారణమైన వ్యక్తిలా కనిపించే కృష్ణమూర్తి ప్రమాదకరమైన పనులను చక్కబెడుతుంటాడు.కృష్ణమూర్తి .. ఆ తరువాత సేనాపతిగా మారతాడు అనే విషయం ఈ ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. అందుకు కారణమేమిటి? రహస్యంగా ఆయన సాగిస్తున్న అన్వేషణ దేని కోసం? అనే అంశాలు ఉత్కంఠను రేపుతున్నాయి. ఈ ప్రశ్నలను సమాధానం దొరకాలంటే ‘సేనాపతి చిత్రాన్ని చూడాల్సిందే.

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement