Thursday, April 25, 2024

హుస్సేన్​ సాగర్‌లో గణేష్ నిమజ్జనంపై రేపు సుప్రీంలో విచారణ

హుస్సేన్​సాగర్‌లో నిమజ్జనం అంశంపై సుప్రీంకోర్టు హలో రేపు విచారణ జరగనుంది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను అత్యవసరంగా విచారించేందుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. పిటిషన్ను రేపు విచారిస్తామని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు.

హుస్సెన్​సాగర్​తో పాటు జంటనగరాల్లోని ఇతర జలాశయాల్లో పీవోపీ వినాయక విగ్రహాల నిమజ్జనం చేయోద్దన్న హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. నిమజ్జనంపై రేపు సుప్రీం కోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఒకవేళ అనుకూలంగా తీర్పు రాకుంటే నిమజ్జనం విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే అంశాలపై ఇప్పటికే ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement