Thursday, April 25, 2024

గిరిజన రిజర్వేషన్ పెంపుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

గిరిజన రిజర్వేషన్ పెంపుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గిరిజన రిజర్వేషన్ల పెంపు జీవో చట్టబద్ధం కాదని, జీవో వల్ల ఆదివాసీలకు నష్టం జరుగుతుందంటూ పలు సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో నేడు విచార‌ణ జ‌రిగింది. ఈ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ విధంగా వ్యాఖ్యానించింది. కొత్త జీవోతో రిజర్వేషన్లు 50% దాటుతాయని ఆదివాసీ సంఘాలు చెబుతున్నాయి. అంతేకాదు చెల్లప్ప కమిషన్ 9% వరకే రిజర్వేషన్లు పెంచుకోవాలని సూచించిందని ఆదివాసీ సంఘాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో జీవోను సవాల్ చేయాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన జీవోను సవాలు చేస్తూ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయవచ్చని సూచిస్తూ విచారణను ముగించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement