Friday, April 19, 2024

RRR బెయిల్‌ పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ..

నర్సాపురం వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ ఉదయం 10 గంటలకు విచారణ జరుపనుంది. ఏపీ ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం క‌లిగించేలా వ్యాఖ్యలు చేశార‌ని ఎంపీ ర‌ఘురామ‌ను మూడు రోజుల కింద‌ట సీఐడీ అధికారులు హైదరాబాద్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసింది. దీనిపై హైకోర్టులో ఆయన బెయిల్ పిటిష‌న్ వేయ‌గా.. కింది కోర్టుకు వెళ్లమ‌ని ఉన్నత న్యాయ‌స్థానం సూచించింది. జిల్లా కోర్టు రఘురామకు ఈ నెల 28 వ‌ర‌కు రిమాండ్ విధించింది.

దీంతో ఎంపీ త‌ర‌ఫు న్యాయ‌వాదులు సుప్రీంకోర్టులో బెయిల్ కోసం పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్‌పై ఇవాళ ఉదయం విచార‌ణ జ‌రుగనుంది. సీఐడీ నమోదు చేసిన కేసులో ఎంపీ రఘురామకృష్ణరాజుకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాది రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌పై జస్టిస్‌ వినీత్‌ శరన్‌, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ల వెకేషన్‌ బెంచ్‌ విచారణ నిర్వహించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement