Thursday, April 25, 2024

ఎంపీ రఘురామ పాదాలకు గాయాలు.. సుప్రీంకు నివేదిక

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నివేదికను న్యాయమూర్తి వినయ్ చరణ్‌ చదివి వినిపించారు. రఘురామ పాదాలకు గాయాలున్నట్టు నిర్ధారణ అయ్యింది. మెడికల్‌ బోర్డు నివేదికకు, ఆర్మీ ఆస్పత్రి చెకప్‌కు మధ్య ఏదో జరిగిందని ప్రభుత్వం తరఫు న్యాయవాది దుష్యంత్ దవే అనుమానం వ్యక్తం చేశారు. కస్టడీలో చిత్రహింసలు నిజమేనని ఈ రిపోర్ట్‌లో తేలిందని పిటిషనర్ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టుకు వివరించారు. రఘురామ తనకు తాను గాయాలు చేసుకున్నారని భావిస్తున్నారా..? అని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మిలటరీ ఆస్పత్రి నివేదికను ఇరు పక్షాలకు మెయిల్‌ ద్వారా పంపిస్తామని ధర్మాసనం తెలిపింది. అనంతరం విచారణ సోమవారానికి వాయిదా వేయాలని ప్రభుత్వ తరపు న్యాయవాది దవే కోరగా.. తక్షణమే విచారణ పూర్తి చేయాలని కోరిన రోహత్గీ కోర్టును కోరారు. ఇలా రెండు వైపులా వాదనలు పూర్తయ్యాయి. అనంతరం విచారణను ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటలకు వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement