Friday, March 29, 2024

నేటి నుంచే ప్రాంతీయ భాష‌ల్లో సుప్రీంకోర్టు తీర్పులు.. ట్వీట్ చేసిన వెంక‌య్య‌నాయుడు

నేటి నుంచి ప్రాంతీయ భాష‌ల్లో సుప్రీంకోర్టు తీర్పులు ఇవ్వ‌నుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ భారతీయ భాషల్లోనూ తీర్పులను అందుబాటులో ఉంచే సేవలను ప్రారంభించారు. దానికి కొన్ని షెడ్యూల్డ్ భాషలలో తీర్పుల అనువాదప్రతులు సిద్ధంగా ఉంచామని సీజేఐ చెప్పారు. ఈ-ఎస్సిఆర్…ఎలక్ట్రానిక్ సుప్రీంకోర్టు రిపోర్టుల ప్రాజెక్టు జనవరి 26 గురువారం నుంచి మొదలవుతుందన్నారు. ప్రజలు, న్యాయ విద్యార్థులు, న్యాయవాదులు ఈ ప్రతులను ఉచితంగానే ఉపయోగించుకోవచ్చు అని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పులను దేశంలోని గుర్తించిన అన్ని ప్రాంతీయ భాషల్లోకి అనువదించేలా కృషి కొనసాగుతున్నట్లు చెప్పారు. ఈ-ఎస్సిఆర్ ప్రాజెక్టులో భాగంగా సర్వోన్నత న్యాయస్థానానికి సంబంధించిన వెబ్ సైట్స్ తో ఇప్పుడు దాదాపు 34 వేల తీర్పులు ఉన్నాయన్నారు.

ఏ తీర్పుకు సంబంధించిన విషయం తెలుసుకోవాలంటే.. దానికి సంబంధించిన విషయాన్ని సెర్చ్ ఇంజిన్ లో టైప్ చేయాలని.. అప్పుడు దానికి సంబంధించిన జడ్జిమెంట్ ప్రతులు ఇంగ్లీషులో వస్తాయని చెప్పారు. ఆ తీర్పులతోపాటు అది ఏ ఏ భాషల్లోకి అనువాదమయ్యాయో కూడా పక్కన లిస్ట్ చూపిస్తుందని అన్నారు. అందులో తమకి ఇష్టమైన భాషను సెలెక్ట్ చేసుకుని తీర్పులను చదువుకోవచ్చు అని తెలిపారు. ఈ ట్రాన్స్లేషన్ ప్రాసెస్ ఇకపై నిరంతరం కొనసాగుతుంది. అనువాదప్రతులను కక్షిదారుల సౌకర్యార్థం క్రమం తప్పకుండా తప్పకుండా అప్ లోడ్ చేస్తూ ఉంటామని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు రిజిస్ట్రీ వెల్ల‌డించింది. దీని మీద మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందిస్తూ ట్వీట్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పులను ప్రాంతీయ భాషలలో కూడా చదువుకునే వీలు కల్పించే ప్రయత్నం అభినందనీయమని అన్నారు. తద్వారా గ్రామ- పట్టణాల మధ్య ఉన్న తేడాను భర్తీ చేయచ్చని.. ఆ దిశగా ఇదొక గొప్ప ముందడుగు అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement