Wednesday, April 17, 2024

రామ‌లింగేశ్వ‌రుడిని స‌న్నిధిలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి

ప్రభ న్యూస్: యునెస్కో గుర్తింపు పొందిన ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేట గ్రామం లోని ప్రఖ్యాత రామప్ప ఆలయాన్ని శనివారం సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ దంపతులు దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న సీజేఐ దంపతులకు ఎంపీ కవిత, ఎమ్మెల్యే సీతక్క, జిల్లా కలెక్టర్‌ ఆదిత్య, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ తదితరులు ఘన స్వాగతం పలికారు.

కుటుంబ సమేతంగా రుద్రేశ్వరున్ని వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీజేఐ పర్యటన నేపథ్యంలో అధికారులు ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ దర్శనం అనంతరం సీజేఐ అక్కడి నుంచి వరంగల్‌ చేరుకుని రాత్రికి నిట్‌ అతిథి గృహంకు చేరుకున్నారు. ఆదివారం ఉదయం నగరంలోని భద్రకాళి అమ్మవారి దర్శనం తర్వాత కోర్టు భవనం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement