Wednesday, March 27, 2024

IPL 2021: సన్ రైజర్స్ ఆటగాడికి కరోనా.. షెడ్యూల్ ప్రకారమే ఢిల్లీతో మ్యాచ్ !

ఐపీఎల్ లో కరోనా కలకలం రేపింది. సన్​రైజర్స్​ హైదరాబాద్​ జట్టులోని ఓ క్రికెటర్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే, మ్యాచ్‌కు కొద్ది గంట‌ల ముందు స‌న్‌రైజ‌ర్స్ బౌల‌ర్ న‌ట‌రాజ‌న్ క‌రోనా బారిన ప‌డిన‌ట్లు తేలింది. అత‌నితో స‌న్నిహితంగా ఉన్న ఆరుగురు ఐసోలేష‌న్‌లో ఉన్నారు. అయితే మిగ‌తా ప్లేయ‌ర్స్‌కు నెగ‌టివ్ రావ‌డంతో ఢిల్లీ, స‌న్‌రైజ‌ర్స్ మ్యాచ్ షెడ్యూల్ ప్ర‌కార‌మే జ‌రుగుతుంద‌ని ఐపీఎల్ స్ప‌ష్టం చేసింది.

ప్ర‌స్తుతం న‌ట‌రాజ‌న్ కి ఎలాంటి కరోనా ల‌క్ష‌ణాలూ లేవని తెలుస్తోంది. మిగ‌తా టీమ్ స‌భ్యుల‌కు దూరంగా అత‌డు ఐసోలేష‌న్‌లో ఉంటున్నాడు. అత‌నితో స‌న్నిహితంగా ఉన్న మ‌రో ఆటగాడు విజ‌య్ శంక‌ర్‌, టీమ్ మేనేజ‌ర్ విజ‌య్‌కుమార్‌, ఫిజియో శ్యామ్ సుంద‌ర్‌, డాక్ట‌ర్ అంజ‌నా వ‌న్న‌న్‌, లాజిస్టిక్స్ మేనేజ‌ర్ తుషార్ ఖేడ్క‌ర్‌, నెట్ బౌల‌ర్ పెరియ‌సామి కూడా ఐసోలేష‌న్‌లో ఉన్నారు. వీళ్లంద‌రికీ ఆర్టీ-పీసీఆర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన‌ట్లు ఐపీఎల్ తెలిపింది.

ఇది కూడా చదవండి: ఏపీ ప్రభుత్వానికి షాక్.. ఆ జీవో సస్పెండ్‌ చేసిన హైకోర్టు

Advertisement

తాజా వార్తలు

Advertisement