Saturday, April 20, 2024

Story : టాలీవుడ్ పై.. బాలీవుడ్ న‌టుల ఇంట్రెస్ట్

బాహుబ‌లి..ఆర్ ఆర్ ఆర్..పుష్ప‌..కాంతార..కేజిఎఫ్ చిత్రాలు సృష్టించిన సెన్సేష‌న్ అంతా ఇంతాకాదు. కాగా ఒకప్పుడు టాలీవుడ్ అంటేనే చిన్నచూపు చూసిన బాలీవుడ్ ఇప్పుడు టాలీవుడ్ ని వదలడం లేదు. ఎందుకంటే టాలీవుడ్ సినిమాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పాకి పోతుంటే బాలీవుడ్ సినిమాలు మాత్రం అట్టడుగుకి వెళ్ళిపోతున్నాయి. ఇకపోతే ఇప్పటివరకు అత్యధిక కలెక్షన్స్ రాబట్టి పాన్ ఇండియా చిత్రాలుగా ఆకట్టుకున్నది ఒక్క దక్షిణాది చిత్రాలే అని చెప్పాలి. దక్షిణాది చిత్రాలపై నార్త్ ఇండియన్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే సౌత్ మార్కెట్ పై దృష్టి పెడుతున్నారని చెప్పాలి. కేవలం హీరో గానే కాకుండా విలన్ గా కూడా మెప్పించడానికి సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే కేజిఎఫ్ సినిమాతో ప్రతి నాయకుడిగా మెప్పించారు సంజయ్ దత్. ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమాతో సైఫ్ అలీఖాన్ కూడా తెలుగుతరకు పరిచయం కానున్నాడు. అలాగే బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కూడా తెలుగులో వినయ్ విధేయ రామ సినిమాలో విలన్ గా కనిపించారు.మరొకవైపు కేజీఎఫ్ 2 లో కూడా సంజయ్ దత్ అధీరా పాత్ర పోషించి అందరిని అలరించాడు. వివేక్ ఒబె రాయ్ మరొకవైపు అజిత్ నటించిన తమిళ సినిమాలో కూడా నటించాడు. ఇక ఈ క్రమంలోనే ప్రస్తుతం లోకేష్ కనకరాజన్ దర్శకత్వంలో విజయ దళపతి నటిస్తున్న లియో చిత్రంలో కూడా సంజయ్ దత్ ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు. సల్మాన్ ఖాన్ వంటి హీరోలు కూడా తెలుగు సినిమాలలో గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తున్న విషయం తెలిసిందే. దాంతో టాలీవుడ్ కి వాల్యూ పెరిగిపోతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement