Thursday, April 25, 2024

వందేభార‌త్ ట్రైన్ పై రాళ్ల దాడి.. దెబ్బ‌తిన్న విండో అద్దాలు

ప‌లువురు దుండ‌గులు వందేభార‌త్ ఎక్స్ ప్రెస్ పై రాళ్ల‌దాడి చేశారు. ఈ ఘటనలో సి6 బోగీ విండో అద్దాలు దెబ్బతిన్నాయి. అయితే, ప్రయాణికులు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. బీహార్‌లోని కతిహార్‌ జిల్లాలోని బలరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. రైలు నంబరు 22302పై కొందరు దుండగులు రాళ్లతో దాడిచేశారు. గతేడాది డిసెంబరు 30న ప్రధానమంత్రి నరేంద్రమోడీ పశ్చిమ బెంగాల్‌లోని హౌరా-న్యూ జల్పాయిగురి మధ్య వందేభారత్ రైలును ప్రారంభించారు. ఆ తర్వాత నాలుగు రోజులకే రైలుపై రాళ్ల దాడి జరిగింది.ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. వందేభారత్ రైళ్లపై జరుగుతున్న వరుస రాళ్ల దాడులు అధికారులను కలవరపెడుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement