Thursday, April 25, 2024

లాభాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నేటి స్టాక్ మార్కెట్లు లాభాల‌తో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూలతలు మన మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు లాభాల్లోనే కొనసాగాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,040 పాయింట్లు పెరిగి 56,817కి చేరుకుంది. నిఫ్టీ 312 పాయింట్లు లాభపడి 16,975కి ఎగబాకింది. అల్ట్రాటెక్ సిమెంట్ (4.69%), యాక్సిస్ బ్యాంక్ (3.65%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.60%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (2.92%), ఇన్ఫోసిస్ (2.69%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచింది. బీఎస్ఈ సెన్సెక్స్ లో సన్ ఫార్మా (-0.35%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-0.07%) గా మిగిలాయి

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement