Wednesday, April 24, 2024

లాభాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్లు

మూడు రోజులు వ‌రుస‌గా న‌ష్టాల బాట ప‌ట్టిన స్టాక్ మార్కెట్లు..గురువారం లాభాల‌తో ముగిశాయి. ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత చివరిలో ఒక్కసారిగా పుంజుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 503 పాయింట్లు లాభపడి 54,252కి పెరిగింది. నిఫ్టీ 144 పాయింట్లు పుంజుకుని 16,170కి ఎగబాకింది. టాటా స్టీల్ (5.27%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (3.26%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2.96%), యాక్సిస్ బ్యాంక్ (2.82%), నెస్లే ఇండియా (2.28%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా మిగిలాయి. సన్ ఫార్మా (-1.16%), రిలయన్స్ (-0.91%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.83%), ఎల్ అండ్ టీ (-0.36%), డాక్టర్ రెడ్డీస్ (-0.21%) టాప్ లూజర్స్ గా నిలిచాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement